ఉన్నత విద్యను ప్రోత్సహించడం: స్కాలర్షిప్ ప్రోగ్రామ్
గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత ఉన్నత విద్యను పొందేలా చూడటానికి 2014-15 ఆర్ధిక సంవత్సరంలో MMFSL ఒక స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రాజెక్ట్ యొక్క వివరాలు దిగువన ఇవ్వబడ్డాయి:
లక్ష్యం: అండర్ గ్రాడ్యుయేట్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులు తమ ఉన్నత విద్యను పొందడానికి స్కాలర్షిప్లు అందించాలనేదే MMFSL స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లక్ష్యం. ఈ స్కాలర్షిప్ కింద భారతదేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కాలేజీల్లో చదువుతుండే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు రూ. 25,000 , అలానే గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.10,000 చొప్పున ఉపకార వేతనం అందించబడుతుంది.
ప్రాజెక్ట్ టైమ్లైన్: జులై నుంచి జనవరి
లబ్ధిదారులు: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ధికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన తెలివైన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. ప్రతి సంవత్సరం 2 లక్షల కంటే తక్కువ గృహ ఆదాయం ఉండేవారిని MMFSL లక్ష్యంగా చేసుకుంటుంది..
- ప్రత్యక్ష లబ్ధిదారులు: అండర్గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్గ్రాడ్యుయేట్ విద్యార్థులు.
- పరోక్ష లబ్ధిదారులు: విద్యార్థుల కుటుంబాలు
లబ్ధిదారుల యొక్క సంచిత సంఖ్య : మహీంద్రా ఫైనాన్స్ స్కాలర్షిప్ కార్యక్రమం 8700మంది కాలేజీకి వెళ్లే విద్యార్ధులు తమ ఉన్నత విద్యను పొందేలా ప్రోత్సహించింది.
కార్యక్రమం యొక్క లొకేషన్: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,తెలంగాణా, కేరళ, కర్ణాటక, గుజరాత్ మరియు రాజస్థాన్.
హునూర్: నైపుణ్యాల రూపకల్పన మరియు ఒకేషనల్ ట్రైనింగ్ ప్రోత్సహించడం
యువతలో ఫైనాన్స్కు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమానికి MMFSL తన మద్దతును అందిస్తుంది. విద్యార్థులకు బోధించే మాడ్యూల్ కంటెంట్ని నిర్వచించడంలో MMFSL ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది.
లక్ష్యం: ఈ ప్రాజెక్ట్కు హైర్-ట్రైన్-డిప్లాయ్ (HTD) మోడల్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యావంతులైన యువకులకు ఈ సెక్టార్లో ఎంట్రీ లెవల్ పోస్టుల్లో ఉపాధి పొందే లక్ష్యంతో శిక్షణ ఇవ్వబడుతుంది.
ప్రాజెక్ట్ టైమ్లైన్: జులై నుంచి జనవరి
లబ్ధిదారులు:
- ప్రత్యక్ష లబ్ధిదారులు: ఉపాధి పొందాలని కోరుకునే గ్రామీణ ప్రాంతాలకు చెందిన నైపుణ్యం లేని యువత
- పరోక్ష లబ్ధిదారులు: కమ్యూనిటీలు మరియు యువత యొక్క కుటుంబాలు
లబ్ధిదారుల యొక్క సంచిత సంఖ్య: సుమారు 2200 నిరుద్యోగులు, నైపుణ్యం లేని యువత ఫైనాన్షియల్ స్కిల్స్పై శిక్షణ పొందారు వారిలో, 1122 మంది సర్టిఫైడ్ మరియు 600 మందికి పైగా BFSI ఇండస్ట్రీలో ఎంట్రీ-లెవల్ జాబ్లు పొందారు.
ప్రదేశం: ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు పంజాబ్
హునూర్: మహిళల కొరకు జీవనోపాధి శిక్షణ
2015-16లో, MMFSL దారిద్ర్యరేఖకు దిగువన ఉండే నైపుణ్యాలు లేని మహిళలు నైపుణ్యాలను అందిపుచ్చుకొని ప్రొఫెషనల్ డ్రైవర్ అయ్యేందుకు దోహదపడే ఒక ప్రత్యేక ప్రాజెక్ట్కు సాయం అందించింది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని వివరాలు దిగువన ఇవ్వబడ్డాయి:
లక్ష్యం: మహిళల ఉద్యోగ కార్యక్రమాలు సాధారణంగా మహిళలు సంప్రదాయంగా చేసే వంట, కుట్లు మొదలైన వాటికి సంబంధించి ఉంటాయి. మహిళలకు సంప్రదాయేతర రీతిలో జీవనోపాధిని పొందేందుకు మరియు వారికి ఉద్యోగాలు అవకాశాలు ఎక్కువగా ఉండే నైపుణ్యాలను బోధించే కార్యక్రమాన్ని MMFSL చేపట్టింది. మహిళా స్వయంసాధికారత ప్రాంతం ఎంతో కీలకమైనదని MMFSL గుర్తించింది, అందువల్లనే దీనిని ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది. ఈ ప్రాజెక్ట్ రెండు స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్ ఫర్ నాన్ ట్రెడిషనల్ ఎంప్లాయిమెంట్ ఫర్ ఉమెన్ (ANEW) మరియు ఆజాద్ ఫౌండేషన్ ద్వారా అమలు చేయబడింది.
ప్రాజెక్ట్ టైమ్లైన్: జనవరి నుంచి డిసెంబర్
లబ్ధిదారులు:
- ప్రత్యక్ష లబ్ధిదారులు: వనరులు తక్కువగా ఉండే నేపథ్యం నుంచి వచ్చిన మరియు అక్షరాస్యత స్థాయి తక్కువగా ఉండే మహిళలకు డ్రైవర్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది.
- పరోక్ష లబ్ధిదారులు: మహిళలు మరియు వారు జీవించే సమాజాలు సైతం.
లబ్ధిదారుల యొక్క సంచిత సంఖ్య: ట్రైనింగ్ కొరకు 450 మంది మహిళలు నమోదు చేసుకున్నారు వారిలో 210 మంది శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందారు మరియు వారిలో 110 మంది మహిళలు ప్రొఫెషనల్ డ్రైవర్లు వలే పని చేస్తున్నారు.
ప్రదేశం: మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు
హునూర్: వైకల్యతతో ఉన్న వ్యక్తుల కొరకు నైపుణ్యాల శిక్షణ (PwD)
వైకల్యత ఉన్న వ్యక్తులకు నాయకత్వం, సోషల్, కమ్యూనికేషన్, కంప్యూటర్లు మరియు ప్రాథమిక జీవిత నైపుణ్యాలతో సహా ప్రత్యేక నైపుణ్యాల రూపకల్పన అనుభవాలను అందించేందుకు మధ్యప్రదేశ్లోని, భోపాల్లో సార్థక్ ఎడ్యుకేషన్ ట్రస్టు సహకారంతో MMFSL స్కిల్ ఆధారిత ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది.
3 నెలల ట్రైనింగ్ కార్యక్రమంలో 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గ్రూపు వారికి 3 బ్రాడ్ వర్టికల్స్ అంటే IT - ITES, టూరిజం & హాస్పిటాలిటీ, ఆర్గనైజ్డ్ రిటైల్ మరియు బ్యాంకింగ్ మరియు ఆర్ధిక అక్షరాస్యతలో శిక్షణ ఇవ్వబడుతుంది.
ట్రైనింగ్ కార్యక్రమం పూర్తయిన తరువాత, ప్రత్యేకమైన ఎంప్లాయిమెంట్ టీమ్ ఉద్యోగ, ఎంప్లాయిమెంట్ డ్రైవ్లు, ఇంటర్వ్యూ డ్రైవ్లు మొదలైనవి నిర్వహించి విభిన్న ఉద్యోగాల కొరకు, అభ్యర్ధులు వివిధ రంగాల్లో అంటే టూరిజం & హాస్పిటాలిటీ, ఆర్గనైజ్డ్ రిటైల్ మరియు IT - ITESల్లో ఉద్యోగాలు పొందలా చూస్తారు.
లక్ష్యం: జాబ్ మ్యాపింగ్ డ్రైవ్ల ద్వారా వివిధ రకాల పరిశ్రమల్లో వైకల్యత ఉన్న వ్యక్తుల నైపుణ్యం కలిగిన వర్క్ఫోర్స్కు డిమాండ్ని సృష్టించడానికి మరియు ఉద్యోగాన్ని చేయడానికి అభ్యర్థులను నైపుణ్యం మరియు సామర్థ్యం ఉన్నవారిగా చేయడానికి
ప్రాజెక్ట్ టైమ్లైన్: సెప్టెంబర్ నుంచి అక్టోబర్
లబ్ధిదారులు:
- ప్రత్యక్ష లబ్ధిదారులు: ఉపాధి పొందాలని కోరుకునే గ్రామీణ ప్రాంతాల నుంచి పిడబ్ల్యుడి
- పరోక్ష లబ్ధిదారులు: కమ్యూనిటీలు మరియు పిడబ్ల్యుడిల కుటుంబాలు
లబ్ధిదారుల యొక్క సంచిత సంఖ్య: సుమారుగా 200 మంది పిడబ్ల్యుడిలు శిక్షణ పొందారు మరియు వారిలో 92 మంది అభ్యర్థులు ఉపాధిని పొందారు.
ప్రదేశం: భోపాల్, మధ్యప్రదేశ్
ఆర్ధిక అక్షరాస్యతను ప్రోత్సహించడం: నగదురహితంగా మారడం
పోస్టర్లు పంపిణీ లేదా ప్రదర్శనకు ముందు కరపత్రాల్లో ఉండే కంటెంట్ని ప్రాంతీయ భాషల్లో వివరించే లీఫ్లెట్లు మరియు పోస్టర్లు వంటి నాలెడ్జ్ మెటీరియల్ని MMFSL పంపిణీ చేసింది.
లక్ష్యం : ఉపాధి, ఆర్ధిక వృద్ధి మరియు పేదరికాన్ని తగ్గించడానికి గ్రామీణ ప్రజానీకం ఆర్ధిక వనరులను సరిగ్గా పొందడం కీలకం. నగదు ఉపసంహరణ భారతదేశంలో ప్రజల బ్యాంక్/లావాదేవీలను బ్యాంక్ నుంచి నగదురహిత/స్మార్ట్ మనీగా మార్చింది. అందువల్ల, లావాదేవీలకు సంబంధించిన వివిధ క్యాష్లెస్ విధానాలపై వ్యక్తులకు అవగాహన కల్పించడానికి తద్వారా ఆర్ధిక లావాదేవీలను నిర్వహించేటప్పుడు క్యాష్లెస్ విధానాలను స్వీకరించడానికి ఇది అవసరం.
లబ్ధిదారులు:
- ప్రత్యక్ష లబ్ధిదారులు: పట్టణ మరియు గ్రామీణ సమాజాల్లో ఉండే వ్యక్తులు
- పరోక్ష లబ్ధిదారులు: ఖాతాదారులు, సరఫరాదారులు, వెండర్లు, భాగస్వాములు మరియు ఉద్యోగులు వంటి భాగస్వాములు.
లబ్ధిదారుల యొక్క సంచిత సంఖ్య: MMFSL 7 రాష్ట్రాల్లో గో క్యాష్లెస్ ప్రాజెక్ట్ని అమలు చేసింది.
ప్రదేశం: మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
విద్యా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం జ్ఞానదీప్ - మున్సిపల్ స్కూల్స్ సందర్శించడం
మున్సిపల్ స్కూల్స్లో ప్రాథమిక ఆవశ్యకతలను మెరుగుపరచడంపై దృష్టిసారించే ప్రోత్సాహాలను చేపట్టింది. మున్సిపల్ స్కూల్స్ విద్యను అందించే ప్రాథమిక సంస్థలు కనుక, ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి వీటిని బలోపేతం చేయాల్సి ఉంటుంది. MMFSL ఉద్యోగులు మున్సిపల్ స్కూల్స్ని సందర్శించి స్కూలు బ్యాగులు, వాటర్ బాటిల్స్, వాటర్ ట్యాంకులు, బెడ్ షీట్లు, బ్లాంకెట్, వెచ్చని దుస్తులు, స్టేషనరీ, వాటర్ ప్యూరిఫైయర్, స్వీట్ ఫ్రూట్లు మరియు విద్యార్ధుల ఇతర ఆవశ్యకతలను అందించారు. వారి కొరకు ఆటలు, డ్రాయింగ్ పోటీలు కూడా నిర్వహించబడ్డాయి,
లక్ష్యం: దారిద్ర్యరేఖకు దిగువన పిల్లలకు సేవలందించే స్కూల్స్లోని ప్రాథమిక సదుపాయాలను బలోపేతంలో సాయపడటమే MMFSL యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమాల ద్వారా, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ప్రజలు నాణ్యతమైన విద్యను పొందడంలో ఉండే ఇబ్బందుల గురించి తన ఉద్యోగులకు అవగాహన కల్పించాలనేది కూడా MMFSL యొక్క లక్ష్యం.
ప్రాజెక్ట్ టైమ్లైన్: ప్రతి సంవత్సరం జూన్ నుంచి జనవరి వరకు
లబ్ధిదారులు: మున్సిపల్ స్కూల్స్ లేదా జిల్లా పరిషత్ స్కూల్స్ వంటి ప్రభుత్వ సాయంతో నడిచే స్కూలు లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా నిర్వహించే స్కూల్స్కు సందర్శనలను నిర్వహించబడ్డాయి మరియు విద్యార్ధులను కలుసుకోవడం జరిగింది.
లబ్ధిదారుల యొక్క సంచిత సంఖ్య: MMFSL సుమారు 19,500 మందికి పైగా విద్యార్ధులను చేరుకుంది.
ప్రదేశం: పాన్ ఇండియా
హెల్త్ చెకప్ క్యాంప్లు
డయాబెటిస్, ఆస్టియోఫోరోసిస్ మరియు కంటి పరీక్షలు వంటి వ్యాధులకు చికిత్సలు అందించడానికి MMFSL ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరాలను పాన్ ఇండియా చేపట్టింది. పోస్ట్-ప్రొసీజర్ లేదా కన్సల్టేషన్ తరువాత ఉచిత రోగనిర్ధారణ మరియు ఔషధాలు అందించబడతాయి.అత్యధిక అర్హతలు కలిగిన మరియు అత్యంత అనుభవం కలిగిన వైద్యులు మరియు వైద్య సిబ్బంది క్యాంప్ని నిర్వహిస్తారు.
లక్ష్యం: MMFSL చేపట్టిన ఆరోగ్య సంరక్షణ శిబిరాలు గ్రామీణ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి.
ప్రాజెక్ట్ టైమ్లైన్: ప్రతి సంవత్సరం జూన్ నుంచి జనవరి వరకు
లబ్ధిదారులు:
- ప్రత్యక్ష లబ్ధిదారులు: మధుమేహం, ఆస్టియోఫోరోసిస్, కంటి సమస్యలు మొదలైన వ్యాధులతో బాధపడే గ్రామీణ ప్రజానీకం.
- పరోక్ష లబ్ధిదారులు: ఈ వ్యాధుల బారినపడిన కమ్యూనిటీలు మరియు కుటుంబాలు
లబ్ధిదారుల యొక్క సంచిత సంఖ్య: MMFSL సుమారు 15,000 మందికి పైగా అబ్దిదారులకు సేవలందించింది.
ప్రదేశం: పాన్ ఇండియా
గత నాలుగు సంవత్సరాల నుండి, MMFSL లైఫ్లైన్ ఎక్స్ప్రెస్కు తన మద్దతును ఇచ్చింది, దీనిలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్, దేశంలోని మారుమూల జిల్లాలకు రైలు ద్వారా వైద్య సేవలు అందించబడతాయి. లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ గ్రామీణ ప్రాంతాలకు శారీరక వైకల్యాలకు అధిక నాణ్యత గల శస్త్రచికిత్సా సౌకర్యాలను అందిస్తుంది, ఇక్కడ అటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి మరియు నాణ్యత తక్కువగా ఉంది. అందించిన సదుపాయాలలో చీలిక పెదవి, చెవి, కన్ను, మూర్ఛ, దంత వైకల్యాలు వంటి వైకల్యాలకు శస్త్రచికిత్సలు ఉన్నాయి.
లక్ష్యం: గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల, దీర్ఘకాలిక వికలాంగుల నుండి ఉపశమనం కలిగించే సాధారణ శస్త్రచికిత్సా విధానాలకు ప్రాప్యత కష్టం. శారీరక వైకల్యాలకు నివారణ మరియు నివారణ వైద్య సేవలను అందిస్తున్నందున లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది.
ప్రాజెక్ట్ యొక్క కాలక్రమం: ఆర్థిక సంవత్సరంలో 1 నెల
లబ్దిదారులు:
-- ప్రత్యక్ష లబ్ధిదారులు: గ్రామీణ జనాభా ఎవరికి వైద్య సేవలను, ముఖ్యంగా శస్త్రచికిత్స చికిత్సలను పొందడం ఒక సవాలు.
--పరోక్ష లబ్ధిదారులు: శస్త్రచికిత్స చికిత్స అవసరమయ్యే వైకల్యం ఉన్నవారి కుటుంబాలు.
లబ్ధిదారుల సంచిత సంఖ్య: గత మూడు లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ ప్రాజెక్టుల ద్వారా, దృష్టి, ఆడియో, చీలిక పెదవి, దంత, మూర్ఛ మరియు గర్భాశయ క్యాన్సర్కు రోగ నిర్ధారణ పొందిన వైకల్యాల కోసం చికిత్స పొందిన 20,300 మంది లబ్ధిదారులకు MMFSL చేరుకుంది.
ప్రదేశం: మహారాష్ట్ర, బీహార్, ఉత్తర ప్రదేశ్
జీవందన్: రక్తదాన శిబిరాలు
జీవందన్, మహీంద్రా ఫైనాన్స్ నిర్వహించిన అతిపెద్ద కార్యకలాపాలలో రక్తదానం ఒకటి. ప్రతి సంవత్సరం, వ్యవస్థాపక దినోత్సవం రోజున, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ (ఎఫ్ఎస్ఎస్) కోసం ఎఫ్ఎస్ఎస్ సిఎస్ఆర్ డేగా జరుపుకుంటారు మహీంద్రా ఫైనాన్స్ తన కార్యాలయాల్లో దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది.
లక్ష్యం: ముఖ్యంగా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో, అవసరమైన వారికి రక్తం లభ్యతను మెరుగుపరిచేందుకు రక్తదాన శిబిరాలు జరిగాయి. గ్రామీణ భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలపై MMFSL ఉద్యోగులను సున్నితం చేయడం మరియు వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను మెరుగుపర్చడానికి దోహదపడటానికి ఇది లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాజెక్ట్ యొక్క కాలక్రమం: అక్టోబర్ మొదటి వారం
లబ్దిదారులు:
- ప్రత్యక్ష లబ్ధిదారులు: జనాభాకు గ్రామీణ ప్రాంతాల్లోని రక్త బ్యాంకులు రక్తదానానికి సులువుగా అందుబాటులో లేవు.
-పరోక్ష లబ్ధిదారులు: రక్తదానం చేయలేని గ్రామీణ వర్గాలు.
లబ్ధిదారుల సంచిత సంఖ్య: ఈ డ్రైవ్ ద్వారా 15,528 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 26,782 వాలంటీర్లు పాల్గొన్నారు.
ప్రదేశం: పాన్ ఇండియా
అంబులెన్ డొనేషన్ ప్రాజెక్ట్
ఈ ప్రాంతాల్లో వైద్య సేవల్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు MMFS 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు అంబులెన్స్లు విరాళంగా ఇవ్వడం ప్రారంభించింది.
లక్ష్యం: రోగులను చేరుకునేందుకు మరియు అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలను తక్షణం అందుబాటులో ఉంచేందుకు ఆసుపత్రులకు సాయం చేసేందుకు అంబులెన్స్ డొనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రాజెక్ట్ టైమ్లైన్: జులై నుండి డిసెంబర్ వరకు
లబ్ధిదారులు:
- ప్రత్యక్ష లబ్ధిదారులు: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆసుపత్రులు/స్వచ్చంద సంస్థలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి సేవలందిస్తాయి మరియు అతి తక్కువ ఖర్చుతో వారికి వైద్య చికిత్సను అందిస్తాయి.
- పరోక్ష లబ్ధిదారులు: చౌకైన వైద్య చికిత్సను పొందాల్సిన అవసరం ఉన్న సమాజాలు.
లబ్ధిదారుల యొక్క సంచిత సంఖ్య: భారతదేశంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఇప్పటివరకు 47 అంబులెన్సులు విరాళంగా ఇచ్చింది.అంబులెన్స్ విరాళం కార్యక్రమం ఇప్పటి వరకు 1,11,500 మంది లబ్ధిదారులపై ప్రభావం చూపింది.
ప్రదేశం: మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్
మెడికల్ ఎక్విప్మెంట్ డొనేషన్ ప్రాజెక్టు
దేశంలోని పేద జనాభాకు సేవలు అందించే చాలా ఆసుపత్రుల్లో వైద్య మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి.మహీంద్రా ఫైనాన్స్ 2015-16వ ఆర్థిక సంవత్సరంలో మెడికల్ ఎక్విప్మెంట్ డొనేషన్ ప్రాజెక్టును ప్రారంభించింది.ఈ ప్రాజెక్ట్ ద్వారా, మహీంద్రా ఫైనాన్స్ USG మెషీన్స్, ఫోల్డింగ్ గైనకాలజిక్ టేబుల్స్, కాల్పోస్కోప్స్ వంటి క్యాపిటల్ ఇంటెన్సివ్ పరికరాలను ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క రీజనల్ బ్రాంచీలకు విరాళంగా ఇస్తుంది.డొనేట్ చేయబడ్డ పరికరాలు ఒకే ప్రదేశంలో రోగులకు లభ్యమయ్యే సదుపాయాలను పెంచడం ద్వారా క్లినిక్స్లో సానుకూల మార్పును తీసుకొస్తాయి.
గ్రామీణ ప్రాంతాల్లో బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయడం వంటి వాటి ద్వారా సెంటర్కు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా తలసేమియా డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి థింక్ ఫౌండేషన్కు కూడా మేం ఆర్ధికంగా సాయం అందిస్తాం.అదనంగా, తలసేమియా పిల్లల హెమోగ్లోబిన్ స్థాయిల్ని నిర్వహించడానికి ఐరన్ చెలాటిన్ టాట్లెట్లు వంటి ఔషధాలను కూడా ప్రస్తుతం ఉన్న సెంటర్లకు మేం అందిస్తాం.గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డ డే కేర్ సెంటర్లు ఈ సదుపాయాలను పొందడం కొరకు కొన్నిసార్లు వందల కిలోమీటర్లు ప్రయాణించే లబ్ధిదారులకు మద్దతు మరియు సలహాను అందిస్తుంది.ఈ ప్రాజెక్ట్ 6 సంవత్సరాల వయస్సు దాటిన ఈ పిల్లలు బ్రతికి బట్టకట్టే అవకాశాలను పెంచుతుంది.
లక్ష్యం: గ్రామీణ భారతదేశంలో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు నిరుపేద గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడం
ప్రాజెక్ట్ టైమ్లైన్: జనవరి నుంచి డిసెంబర్
లబ్ధిదారులు:
- ప్రత్యక్ష లబ్ధిదారులు: గ్రామీణ భారతదేశంలో ప్రాథమిక వైద్య సేవలు అందుకోని ప్రజలు.
- పరోక్ష లబ్ధిదారులు: ఈ పరికరాల ద్వారా ప్రాథమిక వైద్య సేవలను పొందిన వారి కుటుంబాలు.
లబ్ధిదారుల యొక్క సంచిత సంఖ్య: మెడికల్ ఎక్విప్మెంట్ డొనేషన్ ప్రోగ్రాం కింద రెండు కార్యక్రమాల ద్వారా నేటి వరకు 3,00,000 మందికి పైగా ప్రయోజనం పొందాయి.
ప్రదేశం: హర్యానా, జార్ఖండ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్
మదర్ అండ్ చైల్డ్ హెల్త్కేర్ (ఎంసిహెచ్) ప్రాజెక్ట్
ఎంఎంఎఫ్ఎస్ఎల్ ఎఫ్పిఎ ఇండియా సహకారంతో పోషకాహార భర్తీ ద్వారా తల్లి మరియు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సింక్భూమ్, పాల్ఘర్ / భివాండి మరియు భువనేశ్వర్ గ్రామాలు వరుసగా జార్ఖండ్, మహారాష్ట్ర మరియు ఒరిస్సాలో ఉన్నాయి.
లక్ష్యం: కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు, నర్సింగ్ తల్లులు మరియు ఐదేళ్ల లోపు పిల్లల ఆరోగ్యం మరియు పోషకాహార స్థితిని మెరుగుపరచడం ద్వారా తల్లి మరియు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ముఖ్యంగా పేద మరియు బలహీన జనాభాలో తల్లి మరియు శిశు మరణాలు మరియు అనారోగ్యాలను తగ్గించడానికి మరియు వారి జీవిత నాణ్యతను మెరుగుపరచండి.
ప్రాజెక్ట్ యొక్క కాలక్రమం: ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు
లబ్దిదారులు:
- ప్రత్యక్ష లబ్ధిదారులు: 15000 మంది గర్భిణీలు మరియు పాలిచ్చే మహిళలు, 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 18000 మంది పిల్లలు, 15000 మంది కౌమారదశలో ఉన్న బాలికలు మరియు అబ్బాయిలను పరీక్షించాలని మరియు రెండేళ్ల వ్యవధిలో మూడు లక్షల జనాభాకు మాతా, శిశు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని ఈ ప్రాజెక్ట్ సంకల్పించింది.
- పరోక్ష లబ్ధిదారులు: ప్రత్యక్ష లబ్ధిదారుల కుటుంబ సభ్యులు.
లబ్ధిదారుల సంచిత సంఖ్య: 11,263 మందికి పైన కవర్; వీటిలో 9,569 (78.17%) ప్రాజెక్టు కింద పరీక్షించబడ్డాయి మరియు MCH సేవలను పొందాయి.
ప్రదేశం: జార్ఖండ్, మహారాష్ట్ర మరియు ఒరిస్సా
స్వచ్ఛ భారత్ అభియాన్:శుభ్రత డ్రైవ్
భారతదేశాన్ని పరిశుభ్రంగా చేయాలనే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ అభియాన్ను 2014 అక్టోబర్ 2న ఢిల్లీలోని రాజ్ఘాట్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.మరుగుదొడ్లు, ఘన మరియు ద్రవ వ్యర్థాలను పారవేసే వ్యవస్థలు, ప్రతి ఇంటికి సురక్షితమైన మరియు తగినంత తాగునీటి సరఫరాతో సహా పారిశుద్ధ్య సదుపాయాలను కల్పించడమే కాకుండా 2019 అక్టోబర్ 2నాటికి మొత్తం గ్రామ పరిశుభ్రతను సాధించడమే దీని లక్ష్యం.ఇది జాతిపిత 150వ జయంతి సందర్భంగా ఆయనకు మనం అందించే తగిన నివాళి అవుతుంది.ఈ ప్రచారాన్ని విజయవంతం చేయడంలో ప్రధానమంత్రి స్వయంగా చాలా చురుకైన పాత్ర పోషించడం విశేషం; రాజ్ఘాట్లో వీధిని ఆయనే స్వయంగా శుభ్రపరచడం ద్వారా ప్రచారాన్ని ప్రారంభించాడు.అయితే, ఈ ప్రచార కార్యక్రమ బాధ్యత కేవలం ప్రభుత్వంపైనే మాత్రమే లేదని స్పష్టంగా ప్రకటించారు.స్వచ్ఛ భారత్ ఆలోచనను సాకారం చేయడానికి, దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి దేశంలోని ప్రతి పౌరుడు బాధ్యత వహిస్తాడు.
లక్ష్యం:
- ప్రవర్తనాపరమైన మార్పు తీసుకురావడం ద్వారా ఆరోగ్యకరమైన పారిశుధ్య పద్ధతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం.
- సమాజ స్థాయిలో వ్యర్థాలను పారవేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం.
ప్రాజెక్ట్ టైమ్లైన్: జూన్ నుంచి జనవరి
ప్రదేశం: పాన్ ఇండియా
ప్రాజెక్ట్ హరియాలి:మొక్కలు నాటే కార్యక్రమం
పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో MMFSL చెట్ల పెంపకం కార్యకలాపాల్ని చేపడుతోంది.కాలేజీలు/పాఠశాలలు/ అనాథాశ్రమ ప్రాంగణాల్లో మొక్కలు నాటారు, సమాజం వీటి బాధ్యతను చేపట్టి వాటిని పెంచుతుంది.
లక్ష్యం: గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచడంలో సహాయపడటం ద్వారా విస్తృత-స్థాయి అటవీ నిర్మూలన ప్రభావాన్ని తగ్గించాలని MMFSL భావిస్తుంది.దేశాన్ని ప్రభావితం చేసే పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడానికి మరియు వాటిని MMFSL మిషన్తో అనుసంధానం చేయడానికి MMFSL చురుకైన ఉద్యోగులను ప్రోత్సహిస్తుంది.
లబ్ధిదారులు: స్కూళ్లు, ప్రభుత్వం మరియు కమ్యూనిటీలు
ప్రాజెక్ట్ టైమ్లైన్: ప్రతి సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబరు వరకు
లబ్ధిదారుల యొక్క సంచిత సంఖ్య: MMFSL ఉద్యోగులు 6,58,000 మొక్కలు నాటారు.
ప్రాజెక్ట్ ప్రదేశం: పాన్ ఇండియా
సమాంతర్:వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారు మరియు అనాథలకు మద్దతు ఇవ్వడం
నిర్లక్ష్యం చేయబడిన, పట్టించుకోకుండా విడిచిపెట్టిన సమాజంలోని ఆ వర్గాలకు మద్దతు ఇవ్వడం ఒక ముఖ్యమైన ప్రయత్నంగా MMFSL భావిస్తుంది.
A) అనాధశరణాలయం/వృద్ధాశ్రమం సందర్శించడం/ వైకల్యత ఉన్నవారి ఇంటికి వెళ్లడం
తమ ఉద్యోగుల కొరకు MMFSL అనాధశరణాలయం /వృద్ధాశ్రమం సందర్శించడం/ వైకల్యత ఉన్నవారి ఇంటికి వెళ్లడాన్ని నిర్వహిస్తుంది.వారితో నాణ్యమైన సమయాన్ని గడపడం అదేవిధంగా వారి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి మద్దతు అందించడమే విభిన్న గ్రూపుల యొక్క ఈ సందర్శనల ఉద్దేశ్యం.MMFSL రీజనల్ CSR బృందం సందర్శనకు సంస్థను ఖరారు చేయడానికి ముందు అవసరాన్ని అంచనా వేస్తుంది.
లక్ష్యం: అనాథాశ్రమాలు, వృద్ధాప్య గృహాలు మరియు వికలాంగుల గృహాలను ప్రాథమిక సౌకర్యాలతో బలోపేతం చేయడానికి MMFSL ఈ చర్యను చేపట్టింది.సమాజంలో తరచుగా పట్టించుకోని అనాథలు, వృద్ధులు మరియు వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తన ఉద్యోగులను అవగాహన కల్పించడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యం.
ప్రాజెక్ట్ టైమ్లైన్: జూన్ నుంచి జనవరి
లబ్ధిదారులు: సమాజంలో నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలకు మద్దతు అందించాలని, వృద్ధులు, అనాథలు మరియు వైకల్యత ఉన్న వారితో కలిసి పనిచేయాలని MMFSL భావిస్తుంది.
లబ్ధిదారుల యొక్క సంచిత సంఖ్య: MMFSL ఇప్పటి వరకు 4466 మంది పిల్లలు మరియు 1290 మంది వృద్ధులకు సేవలందించింది.
లొకేషన్: పాన్ ఇండియా
Email: [email protected]
Toll free number: 1800 233 1234 (సోమవారం-ఆదివారం, ఉదయం 8 నుండి రాత్రి 10 వరకు)
(Except National Holidays)
WhatsApp number: 7066331234
ఇక్కడ నొక్కండి మీ సమీప మహీంద్రా ఫైనాన్స్ శాఖని గుర్తించడానికి
For illustration purpose only
Total Amount Payable
50000